చిత్రపురి కాలనిలో రూ.300 కోట్ల స్కాం

 నటుడు ఓ కళ్యాణ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సినిమా రంగంలో ఉన్న కార్మికులకు సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కేటయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ లో పలు అక్రమాలు జరిగాయని, నిజమైన కార్మికులకు ఇల్లు దక్కలేదని, ప్రస్తుతం అక్కడ ఉన్న కొందరు సభ్యుల హయాంలో 300 కోట్ల స్కామ్ జరిగిందంటూ సీనియర్ నటుడు ఓ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హోసింగ్ సొసైటీ లో జరిగే ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు ఓ కళ్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఓ కళ్యాణ్ మాట్లాడుతూ ..  

గత 35 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను, నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు.. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న, ఫిలిం ఫెడరేషన్ లో ఉన్నాను ..నేను ప్రతి విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటాను అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ..  ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కి 65 ఎకరాలు ఇచ్చింది. గత ఇరవై సంవత్సరాలనుండి అవినీతి జరుగుతుంది. 2001, 2005, 2010, 2015 ఇలా ప్రతిసారి చిత్రపురి హౌసింగ్  లో సినీ కార్మికుల సొమ్మును అక్కడున్న కమిటీ 11 మంది సభ్యులు దోచుకుంటుంటున్నారు. ప్రతి సారి నేను ఈ విషయం పై ఫైట్ చేయడం జరుగుతుంది .. కొందరు ఈ విషయంలో న్యాయం చేయాలనీ చూస్తున్నా కూడా కావడం లేదు.  గత 20 ఏళ్ళనుండి అవినీతి జరుగుతుంది. సినీ కార్మికుల కోసం ఇచ్చిన దాన్ని దోచుకుంటుంటున్నారు. అక్కడ 300 కోట్ల స్కామ్ జరిగింది. ఈ కమిటీలో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, వినోద్ బాల ఇలా 11 మంది సభ్యులు అక్కడే పాతుకుపోయి అక్రమాలు చేస్తున్నారు. 

తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్ లో సినిమా వాళ్లకు ఇల్లు కట్టేందుకు డబ్బులు లేవని చెప్పి .. బయటివాళ్లను చేర్చుకోవాలని చెప్పి .. బయటవాళ్ళతో కుమ్మక్కయి నిర్మాణం చేసారు. మన దగ్గర డబ్బు లేదని అంటే సినిమా వాళ్లంతా క్రికెట్ ఆడో, ఇంకోటి చేసి ఫండ్ కలెక్ట్ చేసిన సందర్భాలు లేవా ?  ఆ విషయంలో పరిష్కారం ఉన్నా కూడా బయటివాళ్లను మభ్యపెట్టి ఇక్కడ ప్లాట్స్ ఇప్పించడం జరిగింది. కాంట్రాక్టర్ కు ఇచ్చేదాంట్లో కూడా అవినీతి. ఇలా జరిగిన ప్రతి సారి నేను అడ్డు పడడం జరుగుతుంది. నాటో పాటు నా కమిటీలో ఉన్న కస్తూరి శ్రీనివాస్ , ఎన్నారై నాతొ పాటు ఉండి అన్ని దగ్గరుండి చేయాలనీ అనుకున్నాం.  ఈ విషయంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారితో సంప్రదించాం కానీ అయన కూడా ఈ విషయంలో ఆసక్తి చూపకపోవడంతో పాటు భరద్వాజ ప్యానల్ లో చేరారు. మేమిచ్చిన లెటర్స్ , కంప్లైంట్స్ తో వీళ్ళపై 51 ఎంక్వయిరీ అనేది వేశారు. పరుచూరి వెంకటేశ్వరా రావు అండ్ కమిటీ పై, అది ప్రభుత్వం వేసిన కమిటీ. ఇక్కడ ఐవిఆర్ సి ఎల్ అనే కంపెనీ కి కాంట్రాక్టు ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల మొబిలైజేషన్ డిపాజిట్ అనేది మనం పేయ్ చేయాల్సి ఉంటుంది .. అలా ప్రతి బిల్ కు పది పర్సెంట్ కట్ చేయాలి. కానీ వీళ్ళ కిక్ బ్యాంక్స్ తరహాలో వెనక డబ్బు వసూలు చేసుకుని దాదాపు తినేశారు. అలా ఆ డబ్బు 55 కోట్లకు పెరిగింది. దాని ఇంట్రెస్ట్ తో కలిపి 100 కోట్లు అయింది. అలా వందకోట్ల నష్టం కలుగచేసారు. 

అలాగే స్టేట్ బ్యాంక్ నుండి మనం లోన్ తీసుకున్నాం  35 కోట్లు, 25 ఎకరాల పొలం తాకట్టు పెట్టి ఆ లోన్ తీసుకోవడం జరిగింది. ఈ 25 ఎకరాలకు డబ్బు కట్టక నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ కింద అది యాక్షన్ కు వెళ్ళిపోయింది. ఈ డబ్బంతా ఎక్కడికి డైవర్ట్ చేసారు. ఇందులో 2 బెడ్ రూమ్ ప్లాట్స్ విషయంలో ఇంకా నిర్మాణం జరగలేదు. పాపం వాళ్ళు 10 ఏళ్లుగా ఇంకా డబ్బులు కట్టడంతో పాటు అటు రెంట్స్ కూడా కట్టుకుంటున్నారు. ఈ డబ్బంతా తినేశారు వీళ్ళు .. దానికి సంబందించిన రుజువులు , అధారాలు ఉన్నాయి. ఇదంతా  చేసింది ఇదే గ్రూప్ 2000 సంవత్సరం నుండి ఇదే టీం ఘోరమైన విధంగా దోచుకుంటుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా నీతి న్యాయం, దర్మం  అంటూ వీళ్ళే కూర్చుకున్నారు.  ఈ ఎలెక్క్షన్ తరువాత అక్కడ ఏమి ఉండదు. అక్కడ ట్విన్ టవర్స్ అనేది కడుతున్నారు, మూడున్నర ఎకరాల్లో .. అందులో కూడా ఎదో తినేసేయాలి అని చూస్తున్నారు. అక్కడ కూడా పోటీ, పోటీ .. వినోద్ బాల, కొమర వెంకటేష్ పైన పోటీ చేయడానికి అవకాశం లేదు .. ఇప్పుడు మళ్ళీ పొతే పోనీ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్ లో చేరారు. ఇప్పటికే ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇన్ని జరిగినా కూడా ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే బయటవాళ్ళుకు ఇచ్చేసి .. వాళ్ళు లోపలి వచ్చేసారు. అందువల్ల ఎవరు నిలబడ్డా కూడా అక్కడ మనం గెలిచే ఛాన్స్ తక్కువ. అలా సి కళ్యాణ్ టీం పనిచేస్తుంది. 

ఐ వి ఎఫ్ ఆర్ కాంట్రాక్టు కు 600 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చేశాం. మనకి ఇల్లు కీ ఇచ్చే వరకు వాళ్లదే బాధ్యత .. కానీ ఆ విషయం గురించి ఎవరు చెప్పరు. హుడా కి పర్మిషన్ లేకుండా రో హౌస్ కి లేదు .. ? కానీ డూప్లెక్స్, రో హౌస్ లాంటివి కట్టేసారు. అలా కట్టడం వల్ల బయటివాళ్ళు వచ్చారు. అటు వాళ్ళను కూడా మోసం చేసారు. వీళ్ళు అక్కడ కూర్చోవడం తప్ప చేసింది ఏమి లేదు .. కనీసం ఎన్విరాన్మెంటల్  పర్మిషన్ కూడా తీసుకోలేదు. వాళ్లకు కావాల్సింది డబ్బు, డబ్బు .. డబ్బు ..  ఇందులో ఏ ఒక్క పాయింట్ కూడా అబద్దం కాదు .. దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి.   ఇదంతా బాధతో చేస్తున్నాను .. రో హౌస్ కట్టారు .. ఉన్న లెక్కకంటె ఎక్కువాలో కట్టేసారు. ఎచ్ ఐ జి డుప్లెక్స్ కట్టారు .. అది కట్టాల్సిన అవసరం లేదు. అలా ఇవి కట్టకుంటే .. ఇంకా చాలా మంది కార్మికులకు ప్లేట్స్ దొరికేవి. అలాగే సినీ జర్నలిస్ట్ లకు ఇవ్వాలని అన్నారు .. కానీ అలా ఎవ్వరికి ఇవ్వలేదు. ఇన్ని అవినీతి అక్రమాలు అక్కడ చోటు చేసుకున్నాయి. అందుకే ప్రెస్ ముందుకు వచ్చాను. కనీసం ఇలాగైనా సరే ఈ సమస్యను ప్రజలకు తెలియచేస్తారని నా అభిప్రాయం. 

క్యాషియర్ గా ఉన్న పరుచూరి వెంకటేశ్వరావు, ప్రసిడెంట్ తప్పు చేస్తున్నాడు అని కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి కొమర వెంకటేష్ ని తీసేసారు .. అప్పుడు ఆ ప్రసిడెంట్ చెక్స్ పై సంతకం చేసేటప్పుడు తెలియదా. ఈయనకు తెలియకుండా నే ఇవన్నీ జరిగాయా. అలాగే సెక్రెటరీ వినోద్ బాల కు కూడా తెలియకుండా జరిగిందా. అంత పెద్ద మనిషి .. కార్మికుల సొమ్ముని దోచుకుటూనేవాళ్ళ పంచన చేరి అన్యాయం చేస్తున్నాడు. అయన ఆ తరువాత రెండేళ్లు ఇంట్లో పడుకున్నాడు. 350 సినిమాలకు రచయితగా పనిచేసిన అయన నీతి న్యాయం అంటూ సినిమాలు చేసే అయన చేసేది ఇదా. గవర్నమెంట్ ఇప్పటి వరకు 200 కోట్లు ఇచ్చింది. ప్రభుత్వమే రోడ్లు వేసింది. దాసరి గారి పుణ్యమా అంటూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హుడాకు కట్టకుండా 8 కోట్లు సబ్సిడి ఇచ్చారు. ఇప్పుడున్న కేసీఆర్ గారు కూడా తలసాని శీనన్న ద్వారా 6 కోట్ల రూపాయలు ఇచ్చారు .. ఈ డబ్బంతా ఎటు పోయింది .. ఈ రోజు బ్యాంకులో జీరో ఉంది .. అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? 

అక్టోబర్ 25 కు వీళ్ళ టైం అయిపొయింది. ఆ తరువాత వీళ్ళు అక్కడ ఉండొద్దు .. కానీ హోసింగ్ సొసైటీ ని మోసం చేసి మేనేజ్ చేసుకున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పర్సనల్ ఇంచార్జ్ కమిటీ (pic) కి ఇంచార్జ్ గా చేసారు. కమిటీ వీళ్లపై ఎంక్వయిరీ వేయగానే .. వినోద్ బాల దాన్ని ఆపడానికి కోర్టు లో ఛాలెంజ్ చేసాడు. మా పై కమిటీ వద్దండి అంటూ .. ?  అలాగే కాంట్రాక్టర్ దగ్గర ఆరుకోట్ల రూపాయలు స్కాం చేసినట్టు సిసి కెమెరాల ఆధారాలు ఉన్నాయి., పార్క్ హయత్ హోటల్ లో ఈ పదకొండు మంది గ్యాంగ్ కాంట్రాక్టర్ తో డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కృష్ణమోహన్ రెడ్డి అనే ఏమి లేని దర్శకుడు .. కృష్ణానగర్ నుండి ఆటోలో వచ్చి.. నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. డుప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు .. లక్షలకు లక్షలు వడ్డీలకు ఇస్తున్నాడు. ఈ సొమ్మంతా ఎవరిదీ.. అడిగేవాడు లేడు. అందుకే ఈ విషయాలపై మేము పోరాటం చేస్తున్నాం. ఈ విషయంలో నిర్మాత సి కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. అయన పెద్ద మనిషి అని అయన ద్వారా ఈ సమస్యలు సాల్వ్ చేయాలనీ, ఆయనను ప్రసిడెంట్ చేయాలనీ అనుకుంటే .. అయన ఎవరైతే నలభై కోట్ల నష్టం చేసారో తమ్మారెడ్డి భరద్వాజ ను ప్యానల్ లో పెట్టుకున్నాడు సి కళ్యాణ్ గారు ..  ఇలా ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు ..కోటగిరి వెంకటేశ్వరా రావు కూడా మనకు ఎదో మంచి చేస్తారని అంటే .. వాళ్లకు నచ్చిన వాళ్ళకే పనిచేస్తూ.. వాళ్లకు కావాల్సిన వారికే అన్ని అందేలా చేస్తారు.  అందుకే మా పోరాటం మేమె చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు 350 ఎకరాలు సినీ కార్మికులకు ఇల్లు వచ్చేలా ఏర్పాటు చేస్తాం. సీనియారిటీ ప్రకారం ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ జెస్టిస్ ఫిలిం ఇండస్ట్రీ, ఇన్ జస్టిస్ చిత్రపురి కాలనీ, తప్పకుండా ఈ స్కామ్ లో ప్రతి ఒక్కరు దొరుకుతారు .. అందరు జైలుకు వెళ్లడం ఖాయం అని  అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ కావూరి, ఈశ్వర ప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహ రెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వై వి, శ్రీనివాస కూనపరెడ్డి, ఆత్మకూరు రాధా, మల్లికా టి, మధు జాటోత్ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: