సీఐ, హెడ్ కానిస్టేబుల్ కు 14 రోజుల రిమాండ్
- అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పు
సిఐ సోమశేఖర్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
. కానిస్టేబుల్ గంగాధర్
అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లకు 3వ అదనపు జిల్లా జడ్జి మోకా సువర్ణ రాజు 14 రోజుల రిమాంద్ కు ఆదేశించారు. వారిని పోలీసులు కర్నూలు సబ్ జైల్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి. సలాం అత్త మాబుని కూడా వారికి శిక్ష పడాలంటూ స్వయానా సీఎం జగన్ ను కోరారు. బుధవారం వారికి 14 రోజుల రిమాంద్ కు జడ్జి ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment:
0 comments: