జనని మెడికల్ ఆధ్వర్యంలో..

ఉచిత వైద్య శిబిరం

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

జనని మెడికల్ ఆధ్వర్యంలో కెడం ప్రసాద్ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారంనాడు గడివేముల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంను గడివేయుల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.సుబ్బరామిరెడ్డి, పి హెచ్ సి డాక్టర్ శ్రీమతి ప్రారంభించారు. ఈ శిబిరం నందు సేవలు అందించుటకు వచ్చినా వైద్య బృందంలో  ప్రముఖ స్త్రీ సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ హిందుమతి,  షుగర్ వ్యాధి నిపుణులు దుర్గాప్రసాద్ ను శాలువాతో సత్కరించారు,
ఈ సందర్భంగా ఎస్సై టి.సుబ్బరామిరెడ్డి  మాట్లాడుతూ ఈ శిబిరం వైద్య సేవలను గడివేముల, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పి. హెచ్. సి డాక్టర్ సృజన మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో గర్భిణీలు స్త్రీ సంబంధిత వ్యాధి గలవారు అలాగే ఆడవారికి రక్తహీనత లోపం గలవారు మొదలగు వాటికి ఉచితంగా చూస్తున్నారు కాబట్టి అందరూ ఈ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటె పి. హెచ్. సి లో నన్ను సంప్రదించాలని సలహా ఇచ్చారు. దీనికి పి. హెచ్. సి లో మందులు ఉన్నాయని తెలిపారు, అలాగే డాక్టర్ హిందుమతీ, డాక్టర్ దుర్గా గారు మాట్లాడుతూ నంద్యాల లో గల మా హాస్పిటల్ నందు మీ సమస్యలకు సంపాదిస్తే మేము అతి తక్కువ ఖర్చుతో నార్మల్ డెలివరీ సిజరింగ్ లాపరోస్కోపీ మరియు సంతానలేమి సమస్యలకు అలాగే షుగర్ వ్యాధి విష జ్వరాలకు వైద్యం అందిస్తామని తెలిపారు.
జనని మెడికల్ నిర్వాహకులు రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఈ క్యాంపు నందు ఉచితంగా సుమారు గా 150 ప్రజలకు షుగర్ టెస్ట్, మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే  విచ్చేసిన డాక్టర్లకు అతిథులకు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెసర వాయి శ్రీకాంత్ రెడ్డి, గడివేముల కృష్ణయ్య ఇంద్రహయగ్రీవాచారిలు, శ్రీధర్ చైతన్య కుమార్, హెల్త్ అడ్వైజర్ రెహ్మాన్, శ్రీరామ్ ల్యాబ్ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: