ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
డిహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
(జానోజాగో వెబ్ న్యూస్-మడకశిర ప్రతినిధి)
మడకశిర పట్టణం లోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు డిహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా హనుమంతు అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ-సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పావగడ శ్రీరాం, ఉమర్ ఫారూఖ్ ఖాన్, జుబేర్, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ
జస్టిస్ లోకూర్ కమీషన్ జస్టిస్ ఉషా మెహ్రా కమీషన్ ఎబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలందజేశాయని, సుప్రీంకోర్టు 5బెంచీ ల న్యాయమూర్తులు రాష్ట్రాలు ఏబీసీడీ వర్గీకరణ విషయంలో ముందుకెళ్ల వచ్చు అని చెప్పినా ప్రభుత్వాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శీతాకాల సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా చట్టం చేసి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
Post A Comment:
0 comments: