షాహిద్ మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలి
ఇన్షాఫ్ నాయకులు ఎస్ రియాజ్ ఎస్ షరీఫ్ భాష డిమాండ్
ఇన్షాఫ్ నాయకులు ఎస్ షరీఫ్ భాష
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
మానవమృగాల చేతిలో బలైన దూదేకుల షాహిదకు న్యాయం చేయాలని ఇన్షాఫ్ కమిటీ జిల్లా నాయకులు ఎస్ రియాజ్ ఎస్ షరీఫ్ భాష డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం చాపిరి గ్రామానికి చెందిన దూదేకుల షాహిదా ను అదే గ్రామానికి చెంది బోయ రఘు ప్రేమ పేరుతో మోసం చేసి అతి కిరాతకంగా చెరువులో తోసి చంపాడు,దీనిపై17వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదన్నారు,మరుసటిరోజు నిందితుడు రఘును పోలీస్ స్టేషన్ కు తరలించిన తప్పించుకు పోయాడని పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు,17వ తేదీ చనిపోతే22వ తేదీ వరకు విషయాన్ని దాచిన నిందితుడు రఘు తో పాటు అందుకు సహకరించిన నలుగురిని వెంటనే కాల్చి చంపాలని ఆవేదన వ్యక్తంచేశారు గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో ముస్లిం లపై దాడులు పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వంకఠినమైన చర్యలు తీసుకోకపోతే మరింత ఘోరాలు జరుగుతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే న్యాయం చేయాలని, షాహిద్ ను చంపిన వారిపై కఠినచర్యలు తీసుకొని అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారుఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగ వద్దని అన్నారు.
Post A Comment:
0 comments: