వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా
సబ్ కలెక్టర్ కల్పనా కుమారి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరించుతామని నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిదారుల నుండి సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హరినాథ్ రావు తో కలిసి వినతులను స్వీకరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని, ఆ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నంద్యాల డివిజన్లోని గిరిజన ప్రాంతాల సందర్శనలో భాగంగా మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ చేంచు కాలనీని సందర్శించడం జరిగిందని, అక్కడి గిరిజనుల యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నామని, వారి సమస్యలను కూడా సత్వరమే పరిష్కారం చేస్తున్నామన్నారు, ఈరోజు అందిన వినతులలో భూసమస్యలను గురించి భూములను అక్రమించుకుంటున్నారని, మాకు పాస్బుక్కులు లేవని, పాస్బుక్కులు ఇప్పించాలని, మేము దళితులము మాభూములను అగ్రకులాల వారు ఆక్రమించుకున్నారని మాకు న్యాయం చేయాలని కోరుతూ సామూహికంగా అర్జీలను సమర్పించారన్నారు. ఇండ్ల స్థలాలు కావాలని కోరుతూ కుటుంబ తగాధలకు సంబంధించి వినతులు అందాయన్నారు. ఈ రోజు దాదాపుగా 11 అర్జీలు అందినాయని ఆమె అన్నారు.
Post A Comment:
0 comments: